అనంతపురము జిల్లా గుత్తి పట్టణము నుంచి తాడిపత్రి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారిలో గుత్తి పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో " తొండపాడు " గ్రామం ఉంది. అ గ్రామ ప్రధాన రహదారి ప్రక్కనే ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగావున్న దారిగుండా సుమారు ఒక కిలోమీటరు దూరం కొండ ఎక్కి వెళ్తే కొండపైన స్వామి వారు స్వయంభువుగా వెలసిన " బోలికొండ రంగనాథస్వామి " ఆలయం ఉంది.